సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : భూమి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రైతులు రెవిన్యూ సదస్సుల్లో విరివిగా పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. మండలంలోని జమ్మి గూడెం,గుమ్మడి వల్లి రెవెన్యు విలేజ్ ల పరిధిలోని జమ్మిగూడెం,గుమ్మడి వల్లి,కోయ రంగాపురం పంచాయితీ లో గల కొత్తూరు,మేకల బండ,రమణక్కపేట,వడ్డి రంగాపురం మొత్తం 7 హ్యాబిటేషన్ లలో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జమ్మి గూడెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి లో వైఫల్యాలను అధిగమించి రైతుకు సత్వర న్యాయం చేయడానికి నేడు ఉన్న ప్రభుత్వం భూ భారతి అమలు చేస్తుందని,అందుకోసమే క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారికంగా పరిష్కరించడం కోసం రెవెన్యు సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రామక్రిష్ణ తో పాటు డీటీ హుస్సేన్,ఆర్ఐ లు పద్మావతి,క్రిష్ణ,జమ్మి గూడెం,గుమ్మడి వల్లి,కోయ రంగాపురం కార్యదర్శులు కార్తీక్,ఎస్.బాబు,క్రాంతి కుమార్ లు పాల్గొన్నారు.
రెవిన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES