- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
పితృవియోగంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ మహేష్ తండ్రి గంగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సర్పంచ్ రమేష్ మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సుకురి లింగం, మాజీ కో ఆప్షన్ సభ్యులు హైమద్, నితిన్ రాజిరెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



