- Advertisement -
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
హైదరాబాద్ సచివాలయంలో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ని భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా భువనగిరి నూతన బస్టాండ్ నిర్మాణం కొరకు, నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
- Advertisement -