నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో జరుగుతున్న సంత మల్లన్న జాతర ఉత్సవాల్లో సోమవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సంతమల్లన్న జాతర సందర్బంగా ఆ మల్లన్న స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ మల్లన్న స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట వేల్పూర్ బీహార్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగాధర్ రెడ్డి, దేగం రాములు, అంక్సాపూర్ మాజీ సర్పంచ్ రాజేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.



