- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాల తరబడి రైతులకు ఇబ్బందికరంగా మారిన బంధన్ రోడ్డు మరమ్మత్తులకు సహకరించిన ఎమ్మెల్యే కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అమ్రాజశఖర్, గౌరవ అధ్యక్షులు సురేష్, సంఘం నాయకులతోపాటు స్థానిక నాయకులు సాయ గౌడ్, కురుమే శ్రీనివాస్, లచ్చే వార్ నితిన్, శరత్, షబ్బీర్, శివకుమార్, బొడిగ రవి, చిలుక అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -