నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని రాజరాజేశ్వరి నగర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ అమరగొని సదాశివ్ ను రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సదాశివ్ కు అపరేషన్ అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయనను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయదని, డాక్టర్ల సూచన మేరకు నడుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిప్పెర అనిల్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
మాజీ సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES