- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండలంలోని కిష్టాపూర్, రాంనాయక్ తండా, సోనాపూర్, గ్రామానికి చెందిన వివిధ కారణాలతో పలువురు మృతి చెందిన కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ పసియుల్లా పార్టీ అధ్యక్షులు ముజాఫర్ అలీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం, బండారి స్వామి మామిడిపల్లి ఇందయ్యా రమేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -