- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో రథోత్సవాలు భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలకు ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాదంలో పాల్గొని అనంతరం కుస్తీ పోటీలను నిర్వహించిన గోశాలకు సందర్శించి అక్కడ గంటల తరబడి కుష్టి పోటీలను ఎమ్మెల్యే తిలకించారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. చివరి కుస్తీలో అంతాపూర్ కు చెందిన పైల్వాన్ గెలుపొందారు. ఎమ్మెల్యే వెంట పలువురు ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -