- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో ఆరవ తరగతి స్పాట్ అడ్మిషన్లు ఈ నెల 31న నిర్వహించబడతాయని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి. సరిత బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. మండల పరిధిలోని ఆరవ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదనపు సమాచారం కోసం, స్పాట్ అడ్మిషన్లు జరిగే జూలై 31న పాఠశాల ప్రిన్సిపాల్ను లేదా ఉపాధ్యాయులను సంప్రదించవచ్చన్నారు.
- Advertisement -