ఐసిడిఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లి ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్య రక్షని ఐసిడిఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అన్నారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని మాల్లారం అంగన్ వాడి కేంద్రాల్లో టీచర్లు కాంతమ్మ, రుద్రమదేవి పద్మ, తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సూపర్ వైజర్ హాజరై మాట్లాడారు బిడ్డ జన్మించిన గంటలోపే తల్లి ముర్రుపాలు బిడ్డకు పట్టిస్తే జీవితాంతం రక్షణగా ఉంటుందన్నారు.ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కై ముర్రు పాలను బిడ్డకు పట్టించాలని తెలిపారు. పిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు ముర్రు పాల పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు,చిన్నారులు పాల్గొన్నారు.
తల్లి ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్య రక్ష.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES