- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను త్వరగ వచ్చిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -