నవతెలంగాణ హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242మందిలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా నిలిచాడు. 11 A సీటులో ప్రయాణిస్తున్న బ్రిటన్ కు చెందిన రమేష్ విశ్వాశ్ కుమార్(38) ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం నుంచి బయటపడి రమేష్ నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం రమేష్ కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. రమేష్ విశ్వాశ్ కుమార్ బంధువుల కోసం వెతుకుతున్నాడు. అతను ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. టేకాఫ్ అయిన 30 సెకన్ల తరువాత పెద్దశబ్దం వచ్చి … ఆతరువాత విమానం కూలిపోయిందని చెప్పాడు. ఇదంతా క్షణాల్లో జరిగిందని వివరించాడు. రమేష్ కు ఛాతీ… పాదాలు.. కండ్లపై గాయాలయ్యాయి.
మృత్యుంజయుడు రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES