- Advertisement -
కిషన్ సంయుక్త మోర్చా ఎస్ కే యం జిల్లా కన్వీనర్ దేశెట్టి సాయి రెడ్డి..
ఆగస్టు 13న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం..
నవతెలంగాణ – మాక్లూర్
భారతదేశ ఆర్థిక సంపదను దోపిడీ చేస్తూ వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న బహుళ జాతి సంస్థలు ఏం ఎన్ సి లు భారతదేశాన్ని విడాలని కిషన్ సంయుక్త మోర్చా ఎస్ కే యం జిల్లా కన్వీనర్ దేశెట్టి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బోర్గం(కే) గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కిషన్ సంయుక్త మోర్చా జాతీయ కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆగస్టు 13న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, కావున రైతులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
- Advertisement -