Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక కమిషన్ చైర్మన్ ను కలిసిన మున్సిపల్ కమిషనర్ 

ఆర్థిక కమిషన్ చైర్మన్ ను కలిసిన మున్సిపల్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ శనివారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తరువాత నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొని అక్కడ ఆయన సమావేశ మందిరంలో చైర్మన్, ఇతర హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్థాల చెత్త విభజన, కంపోస్టింగ్ ప్రక్రియ మరియు ఎస్ టి పి (మురుగునీటి శుద్ధి కర్మాగారం) వ్యవస్థల పనితీరుతో సహా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వివిధ అంశాలపై ఆయన క్లుప్తంగా వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్ మావి, సంబంధిత శాఖ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img