జిల్లా పంచాయతీ అధికారి తరుణ్
నవతెలంగాణ వనపర్తి
గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు గ్రామస్థాయి అధికారులు సమాచార హక్కు చట్టం, గ్రామ సభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ సూచించారు. గురువారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నుండి మాస్టర్ ట్రైనర్ పి. కృష్ణ గ్రామ సభల్లో పాల్గొనే గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా డి.పి.ఒ తరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.పి. ఓ మాట్లాడుతూ గ్రామస్థాయి అధికారులు ప్రతి నెల గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించడమే కాకుండా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగ సమాచార హక్కు చట్టం, గ్రామ సభల నిర్వహణ పై గ్రామ స్థాయి అధికారులకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. చట్టాల పై పూర్తి అవగాహన చేసుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. లైన్ డిపార్ట్మెంట్ లు అయిన పంచాయతీరాజ్, సంక్షేమ శాఖ, నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యా, వైద్య శాఖల నుండి 35 మంది గ్రామస్థాయి సిబ్బంది ఈరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవి విరమణ పొందిన మాజీ జిల్లా పంచాయతీ అధికారి, ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాస్టర్ ట్రైనర్ కృష్ణ సిబ్బందికి గ్రామ సభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం -2005 పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్ సిబ్బంది తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సభలు, సమాచార చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



