నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ‘బాయ్కాట్ తుర్కియే’ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వ్యాపారులు తుర్కియే యాపిల్స్, ఇతర వస్తువుల విక్రయాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్ర, అజియో కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ప్లాట్ఫామ్ల నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్కార్ట్కు చెందిన ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ మింత్రా తెలిపింది. రిలయన్స్కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో కూడా తుర్కియేకి చెందిన ప్రముఖ వస్త్ర బ్రాండ్లయిన కోటాన్, ఎల్సీ వైకికి, మావి వంటి వాటి అమ్మకాలను తమ సైట్లో నిలిపివేసింది.
తుర్కియే వస్త్ర బ్రాండ్లను తొలగించిన మింత్ర, అజియో సంస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES