- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ: మండలంలోని వట్టిపల్లి గ్రామపంచాయితీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన కొంపల్లి నాగరాజు గౌడ్ గురువారం హైదరాబాదులోని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నివాసంలో గులాబీ కండువా కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాగరాజు గౌడ్ ను వట్టిపల్లి గ్రామపంచాయితీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్,యువ నాయకులు మల్గిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,నాయకులు దేరెడ్డి యాదగిరి రెడ్డి,అయ్యన్న,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



