- Advertisement -
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్: స్థానిక సంస్థల ఎన్నికల మండల నిర్వహణ అధికారిపై వేటు పడింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో లలిత కుమారి సస్పెండ్ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీఓ ప్రభాకర్ చారిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల వివరాలు జిల్లా కార్యాలయానికి తప్పుగా సమర్పించడంతో జిల్లా అధికారులు డిఎల్పిఓ సురేందర్ ద్వారా సరైన నివేదికలు తెప్పించుకున్నారు. ఎన్నికల విధుల నిర్లక్ష్యంతో పాటు స్థానికంగా అందుబాటులో పలు రకాల కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -



