తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయగిరి సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించి ఎక్కువ సీట్లు కేటాయించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయగిరి సమ్మయ్య కోరారు. ఆదివారం మండలంలోని కోయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నాయి బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారని, రాజకీయంలో చాలా వెనుకబడ్డారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే నాయీ బ్రాహ్మణులకు రాజకీయంలో అవకాశాలు కల్పించాలన్నారు. రాజ్యాధికారంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు జడ్పీటీసీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్స్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కేటాయించే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల తమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
స్థానిక ఎన్నికల్లో నాయిబ్రహ్మణులకు స్తానం కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES