నవతెలంగాణ – మిర్యాలగూడ
ఇటీవల పత్రిక రంగంలో చేసిన సేవలకు గాను జాతీయ అవార్డు పొందిన మిర్యాలగూడకు చెందిన పుట్ల నాగేశ్వర్ రావుకు, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, సెక్రటరీ భోగ వెల్లి వెంకటరమణ చౌదరి(బాబి) లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫొటో గ్రాపర్ గా నాగేశ్వర్ రావు పత్రిక రంగంలో ప్రవేశించి జాతీయ స్థాయి అవార్డ్ స్వీకరించే స్థాయికి ఎదిగడం హర్షించదగిందన్నారు. నాగేశ్వర్ రావు భవిష్యత్ లో ఉన్నత స్థాయి కి ఎదిగి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమములో బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, గిరి, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత పుట్ల నాగేశ్వరరావుకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



