నవతెలంగాణ – అశ్వారావుపేట: భూగర్భజలాలు పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేస్తున్న కృషిని ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన కేంద్ర జల శక్తి మిషన్ సమావేశం ప్రశంసించింది. ఈ క్రమంలో జిల్లా నిర్మిస్తున్న ఇంకుడు గుంతలు ను పరిశీలించేందుకు కేంద్రం నుండి ఒక బృందాన్ని కేటాయించారు. ఈ నేపద్యంలో గురువారం మండలంలోని అశ్వారావుపేట,మద్ది కొండ స,రామన్నగూడెం,ఆసుపాక,వినాయక పురం,నారాయణపురం లో నిర్మించిన 11 ఇంకుడు గుంతలను జాతీయ వాటర్ మిషన్ సబ్ డివిజనల్ ఇంజినీర్ పృథ్వీరాజ్,డీఆర్డీఏ సిబ్బంది ఎంవీకే లు తనిఖీ చేసారు. వీరి వెంట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంజీఎన్ఆర్జీఎ ఏపీఓ కిలాపర్తి రామచంద్రరావు,ఆయా పంచాయితీల కార్యదర్శులు సమ్మయ్య,శ్రీకాంత్,సందీప్,మహేశ్వరిలు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలను తనిఖీ చేసిన జాతీయ జలశక్తి బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES