డార్లింగ్ కష్ణ, మనీషా హీరో, హీరోయిన్స్గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ మూవీ ‘బ్రాట్’. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంజునాథ్ కంద్కూర్ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘యుద్ధమే రాని..’ సాంగ్ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని నటుడు నరేష్ లాంచ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ రాశారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ,’మంజునాథ్ ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రొడ్యూసర్. నాతో కన్నడలో సూపర్ డూపర్ హిట్ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి అద్భుతమైన సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ఐదు భాషల్లో చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. అందరికీ రిలేట్ అయ్యే కథ ఇది. అర్జున్ జన్య ‘యుద్ధమేరాని..’ పాటని అద్భుతంగా కంపోజ్ చేశారు. కన్నడ, తెలుగు రెండు భాషల్లో కూడా సిద్ శ్రీరామ్ ఈ పాటని అద్భుతంగా పాడారు’ అని డైరెక్టర్ శశాంక్ చెప్పారు.
నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ,’ఈ పాట లాగే సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసి పెద్ద విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఇది చాలా బ్యూటీఫుల్ సాంగ్. సిద్ శ్రీ రామ్ వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన ఈ సాంగ్ పాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరో డార్లింగ్ కష్ణ చెప్పారు. హీరోయిన్ మనీషా మాట్లాడుతూ,’ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నా పాత్ర మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.
నయా యాక్షన్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -