– హుస్నాబాద్ ఏపిఎం బబ్బురు తిరుపతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండల పరిధిలో నూతన సంఘాలను ఏర్పాటు కోసం మహిళ సంఘాల అధ్యక్షులు, సీఏ లు కృషి చేయాలని హుస్నాబాద్ ఏపిఎం బబ్బురు తిరుపతి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు, సీఏల తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా శక్తి లో భాగంగా సామాజిక చేకూర్పు, నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, వయోవృద్ధుల సంఘాలు మరియు కిషోర బాలికల సంఘాల ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివో మండల అధ్యక్షురాలు, గ్రామాల మహిళా సంఘాలు, సిబిఓ ఆడిటర్ ప్రసాద్, సి.సి అశోక్,యం.యస్. ఏ, కంప్యూటర్ ఆపరేటర్ జితేందర్, సిఏలు తదితరులు పాల్గొన్నారు.
నూతన సంఘాలను ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES