- Advertisement -
– హైబ్రిడ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ విడుదల
హైదరాబాద్ : పాంటోమత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్లో భాగమైన ది వెల్త్ అసెట్ మేనేజ్మెంట్ హోల్డింగ్స్ సంస్థ కొత్తగా ‘ది వెల్త్ కంపెనీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. పేరుకు తగ్గట్లే కమోడిటీల మేళవింపుతో మల్టీఅసెట్ ఫండ్ పెట్టుబడులను ఈక్విటీలు, డెట్, కమోడిటీల్లో క్రియాశీలకంగా కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) నవంబర్ 19న ప్రారంభమై 2025 డిసెంబర్ 3న ముగుస్తుందని వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్ సీఐఓ అపర్ణ శంకర్ తెలిపారు.
- Advertisement -



