నవతెలంగాణ-హైదరాబాద్: డిజిటల్ యుగంలో నగదు వాడకం తగ్గిపోయి..క్యూఆర్ కోడ్తో కూడిన చెల్లింపులు ఎక్కువైపోయ్యాయి. ఈ నేఫథ్యంలో ఆన్లైన్ చెల్లింపుల కోసం వివిధ రకాల యాప్స్ పుట్టుకొచ్చాయి. ఈ యాప్ల ద్వారా ఇంటికి సంబంధించిన చెల్లింపులతో పాటు వ్యాపార సంబంధమైన లావాదేవీల నిర్వహణ సులభతరమైంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఆగష్టుతో పలు మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది.
ఆగస్టు 1వ తేదీ నుంచి UPIకి సంబంధించి అనేక కొత్త నియమాలు అమలు కాబోతున్నాయి. మీరు PhonePe, G Pay, Paytm లను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే, మెరుగైన చెల్లింపు సౌకర్యాలను అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక నియమాలను మార్చింది. ఇందులో భాగంగా NPCI కొన్ని కొత్త పరిమితులను సైతం విధించింది. ఇది మీ చెల్లింపులను ప్రభావితం చేయదు.. కానీ, బ్యాలెన్స్ చెక్, స్టేటస్ రిఫ్రెష్, ఇతర విషయాలపై ఆంక్షలను విధిస్తుంది.
అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి UPI యాప్ నుంచి ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు. నెట్ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల లాంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు.. అలాగే, రాత్రి 9.30 తర్వాత.. మీరు ఒక రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేసే వీలుంటుంది. ప్రతి చెకింగ్ కు మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.
మీరు ఎస్బీఐ కార్డ్ హోల్డర్ అయితే, మీకు బిగ్ షాక్ అని చెప్పాలి.. ఎందుకంటే ఆగస్టు 11వ తేదీ నుంచి, SBI అనేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్ను నిలిపివేయబోతుంది. ఇప్పటి వరకు, SBI, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్లతో కలిసి కొన్ని ELITE, PRIME కార్డులపై రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల వరకు బీమా కవర్ను అందించేది.