చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.3గా అతిరథ మహారధుల సమక్షంలో కొత్త సినిమా ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షరు, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొంద నున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి.మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకష్ణ, బి.గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్ను అందించగా, ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు. నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమద్ధి ఈ చిత్రంతో తెలుగు ఇండిస్టీకి పరిచయమవుతోంది.
ఈ చిత్రానికి సంగీతం : స్టీఫెన్, ఆనంద్, ఆర్ట్ : సాహి సురేష్, ఎడిటింగ్ : విజరు ముక్తవరపు, కెమెరామెన్ : అజరు అబ్రహం జార్జ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్, యాక్షన్స్: నటరాజ్.
సరికొత్త కథ
- Advertisement -
- Advertisement -