- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాద కుట్ర దర్యాప్తుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ గురువారం జమ్మూ కాశ్మీర్ అంతటా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు. పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వారా జిల్లాలతో సహా 32 ప్రదేశాలలో సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు అంటే లాజిస్టికల్ సపోర్ట్, నగదు, ఆశ్రయం, ఇతర మౌలిక సదుపాయాలతో ఉగ్రవాదులకు సహాయం చేసే వ్యక్తులుపై దృష్టి సారించిందని తెలుస్తోంది.
- Advertisement -