Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపారిశ్రామికవేత్తలెవరూ వెనక్కి వెళ్లొద్దు

పారిశ్రామికవేత్తలెవరూ వెనక్కి వెళ్లొద్దు

- Advertisement -

– రైతులతో మాట్లాడి భూములిచ్చేందుకు ఒప్పించాలి ొడేటా సెంటర్లకు కావాల్సిన స్థలాలు గుర్తించండి
– ఫ్యూచర్‌ సిటీ భూ సేకరణ వేగవంతం చేయండి : పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఫ్యూచర్‌ సిటీ భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదే శించారు. శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసంలో పరిశ్రమల శాఖపై మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సమీక్షించారు. ఫ్యూచర్‌ సిటీ భూ సేకరణ, పెట్టుబడులు తదితర అంశాల పురోగతిపై ఈ సందర్భంగా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, వాటికి కావాల్సిన స్థలాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత రైతులతో మాట్లాడి భూములు ఇచ్చేందుకు ఒప్పించాలని సూచించారు. ఫ్యూచర్‌ సిటీలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ క్యాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలనీ, అందుకు గాను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ ఆర్కిటెక్చర్లను నియమించుకోవాలని ఆదేశించారు. అందులో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, గోల్ప్‌ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్లాన్‌ చేయాలన్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌పై మంత్రి వర్గ ఉపసంఘం ప్రతీ 15 రోజులకోసారి సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై చర్చించాలని సూచించారు. 2024లో 70 గ్లోబల్‌ కెపబులిటీ సెంటర్లు వచ్చాయనీ, ఈ ఏడాది ఇప్పటికే 25 సెంటర్లు వచ్చాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. అదే స్ఫూర్తితో మరిన్ని సెంటర్లు వచ్చేలా కృషి చేయాలని సీఎం వారికి సూచించారు. పరిశ్రమల శాఖపై అధికారులు వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకొని చిత్త శుద్ధితో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి. స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ సంజరు కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండ్రస్టీస్‌ నిఖిల్‌ చక్రవర్తి, టీజీఐసీసీ వైస్‌ చైర్మెన్‌ శశాంక ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -