ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నోడల్ అధికారులు తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. నోడల్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సమావేశమై, వారి విధుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, నోడల్ అధికారుల విధులు, బాధ్యతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. మానవ వనరుల నిర్వహణ, శిక్షణ, రవాణా, మోడల్ కోడ్ కండక్ట్, ఖర్చు పర్యవేక్షణ, పోస్టల్ బ్యాలెట్, ఎలక్టోరల్ రోల్స్, ఎన్నికల పరిశీలకులు విషయమై నోడల్ అధికారుల నియామకం చేసినట్లు తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించి నియామకం చేసిన నోడల్ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలకు సంబంధించి అన్ని విధాలుగా సర్వ సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల నిబంధనలు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సరిపోను సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. పర్యవేక్షణ బృందాల రవాణాకు కావాల్సిన వాహనాలు సిద్ధపర్చుకోవాలన్నారు. వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగానికి వచ్చే ఎన్నికల ఫిర్యాదులను వేగంగా, క్వాలిటీ పరిష్కారం చూపేలా సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా నోడల్ అధికారులు విధులు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



