Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ఆగని ఎన్‌కౌంటర్లు

ఛత్తీస్‌గఢ్‌లో ఆగని ఎన్‌కౌంటర్లు

- Advertisement -

మరో నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఎన్‌కౌంటర్లు సాగుతున్నాయి. తాజా కాల్పుల్లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాళ్లగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ప్రస్తుతం భీకర ఎదురు కాల్పులు సాగుతున్నాయి. రెండురోజుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్‌ కగార్‌’ తో భారత భద్రతా దళాలు మావోస్టులను మట్టుబెడుతున్నారని పౌరహక్కుల వేదిక నాయకులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -