- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో ఈదుల చెరువు కాలువను పలువురు అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ….చెరువులకు, కాల్వలకు మరమ్మత్తులు చేపడుతామని అన్నారు. చెరువు అడ్డంగా ఉన్న కంపచెర్లను తొలగించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ హభిబ్ హుదిన్, ఇరిగేషన్ అధికారులు సాయి, మధు, రామయ్య నాయకులు మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ రైతులు తోట వెంకటేశం, తంగళ్ల శ్రీనివాస్, ముత్యాల నరేందర్ రెడ్డి, వెంకటేష్, రాజు పలువు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -