Friday, June 20, 2025
E-PAPER
Homeబీజినెస్తరగతి గదిలో ఏఐ పాఠాలకు ఏడాది

తరగతి గదిలో ఏఐ పాఠాలకు ఏడాది

- Advertisement -

నవతెలంగాణ విశాఖపట్నం: క్వెస్ట్ అలయన్స్, సమగ్ర శిక్ష (ఎస్ఎస్ఏ ఏపి), లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ (ఎల్ఎఫ్ఈ ) భాగస్వామ్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని100 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలల్లో 7, 8 , 9 తరగతుల పిల్లల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకోని ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో జూన్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల పాటు ” హ్యాక్ టు ది ఫ్యూచర్ ఆంధ్ర 2025″ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ , ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో నిర్వహించారు. ప్రాథమిక ఏఐ నేపథ్యాలు, భవిష్యత్తు నైపుణ్యాలు, కెరీర్ విద్యను అభ్యాసకులకు ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఇది ఉపాధ్యాయులకు సాంకేతికతతో కూడిన సమగ్ర అభ్యాసాన్ని సులభతరం చేయడానికి ఉపకరణాలు, శిక్షణను కూడా అందించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారి అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హ్యాకథాన్ బూట్‌క్యాంప్, ప్రోటోటైప్ షోకేస్, ఉపాధ్యాయ గుర్తింపు వేడుక, జరిగాయి. మూడు బృందాలలో పనిచేస్తున్న ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు, 13 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ-ఆధారిత ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేశారు. వ్యర్థాల నిర్వహణ నుండి ప్రజా సేవలను అందుబాటులో తీసుకురావటం వరకు ఉన్న సమస్యలను ఈ ప్రాజెక్టులు పరిష్కరించాయి. ప్రొఫెసర్లు, నిధులు అందించేవారు , విద్యావేత్తలు, రాష్ట్ర అధికారులతో కూడిన నిపుణుల ప్యానెల్‌కు అవి సమర్పించబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -