- Advertisement -
ఇంకా లభించని కృష్ణ ఆచూకీ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
గల్లంతైన వ్యక్తి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఐన ఆచూకీ లభించలేదు. మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణ ఆర్థిక ఇబ్బందులు తాళలేక గురువారం సాయంత్రం మానేరు వంతెన పై నుండి దూకి గల్లంతైన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం తెల్లవారు జామున్నుండి కరీంనగర్ నుండి వచ్చిన ఐదుగురు గజ ఈతగాళ్లతో కలిసి సిరిసిల్ల రెస్క్యూ టీమ్  గాలికి చర్యలు చేపట్టారు. మానేరు వాగు మొత్తం రోజంతా వెతికినా కృష్ణ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.
- Advertisement -

 
                                    