- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్థాన్ జట్టు తమ సంప్రదాయ గ్రీన్ జెర్సీకి బదులుగా ప్రత్యేకమైన పింక్ జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులకు సంఘీభావం తెలిపేందుకు, వారికి మద్దతుగా నిలిచేందుకు ఈ పింక్ జెర్సీ ధరించనున్నట్టు పీసీబీ వెల్లడించింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 28న జరిగే తొలి మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు పింక్ రంగు దుస్తుల్లో మెరవనున్నారు.
- Advertisement -



