Friday, October 24, 2025
E-PAPER
Homeజాతీయం10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పాన్‌-ఇండియా 'సర్‌'

10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పాన్‌-ఇండియా ‘సర్‌’

- Advertisement -

ఈసీఐ కసరత్తు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ఓటర్ల జాబితా అమలు కోసం భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ ప్రక్రియ ప్రకారం.. మొదటి దశ ఎన్నికలు జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ , పశ్చిమ బెంగాల్‌తో సహా 10 కంటే ఎక్కువ రాష్ట్రాలు , ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అమలు చేయనున్నట్టు సంకేతాలిచ్చింది. గురువారం ఢిల్లీలో ముగిసిన రెండు రోజుల చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ల (సీఈఓ) సమావేశంలో పాన్‌-ఇండియా సర్‌ కోసం అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధతను ఈసీఐ సమీక్షించింది.

ఈ విషయాన్ని చర్చించి షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటుందని, ఇది త్వరలో ప్రకటించబడుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి.2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ,పశ్చిమ బెంగాల్‌లతో ప్రారంభించి ఈ ప్రక్రియను రెండు దశల్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న , శీతాకాలంలో కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్న రాష్ట్రాలను తరువాతి దశల్లో పరిష్కరిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -