పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద మృతుని కుటుంబానికి 50 కేజిల బియ్యం అందజేత…
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని పొనకల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోడూరి శేఖర్ కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ మాదాడి సరోజన, రవీందర్ రావు, ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, మూల భాస్కర్ గౌడ్, మర్రి పెళ్లి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా నిలుస్తున్న పీసీఆర్ ఫౌండేషన్..
- Advertisement -
- Advertisement -