- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మునిసిపాలిటి పరిధిలో ఎలాంటి వ్యాపార ప్రకటన ప్రచారం,రాజకీయ పార్టీలు ప్రచారం చేసేందుకు తప్పని సరిగా మున్సిపాల్టీ అనుమతి తప్పని సరి అని కమీషనర్ నాగరాజు తెలిపారు. బుధవారం ఎటువంటి అనుమతులు లేని వ్యాపార ప్రకటన ప్రచారం నిర్వహిస్తున్న ఆటో ను నిలుపుదల చేసి రూ.1000 లు జరిమానా విధించారు.
ఈసందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో బహిరంగంగా ప్రదేశాల్లో ప్రచారం కొరకు ఏర్పాటు చేసిన ప్లెక్సీ లకు సైతం అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -