మాజీ ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు
కాంగ్రెస్ డివిజన్ యూత్ నాయకుడు రాహుల్
నవతెలంగాణ – మల్హర్ రావు : కిషన్ రావుపల్లి పారెస్ట్ నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు రోడ్డు నిర్మాణం కోసం పేస్-1 క్లియరెన్స్ మే నెల 9న వచ్చిందని ఇది తెలియక బిఆర్ఎస్ నాయకులు పిచ్చికుతలు కుస్తూ, అసత్యపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహాల్ రావు,కాంగ్రెస్ యూత్ డివిజన్ నాయకుడు మండల రాహుల్ అన్నారు. మంగళవారం పెద్దతూoడ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తాము ప్రభుత్వంలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు మాత్రం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్లుగా ఆరోపించారు.తమ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు పెద్దతూoడ్ల గ్రామానికి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు చేసినట్లుగా తెలిపారు.శాత్రజ్ పల్లి రెవెన్యూ శివారులో కాంగ్రెస్ నాయకులు అక్రమ పట్టాలు చేసుకొని రైతుబందు పొందినట్లుగా అసత్యపు ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి, దమ్ముంటే నిరూపించాలని,లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దళితులమని ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదు ఆధారాలతో నిరూపించాలన్నారు.లేదంటే బిఆర్ఎస్ నాయకుల అక్రమ పట్టాలపై తాము నిరూపిస్తామన్నారు.శాత్రజ్ పల్లి రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 26లో ఆన్లైన్ భూ జాబితాను బహిరంగంగా పట్టుకొని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం దేవస్థాన డైరెక్టర్ నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,అడ్వాల మహేష్,శ్రీనివాస్,కిషన్ నాయక్,ఆగయ్య పాల్గొన్నారు.
కిషన్ రావుపల్లి రోడ్డు నిర్మాణం కోసం పేస్-1 క్లియరెన్స్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES