- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను జూబ్లీహిల్స్ పీఎస్లో లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని చెప్పింది. కస్టోడియల్ దర్యాప్తునకు సిట్కు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ప్రభాకర్రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని తెలిపింది.
- Advertisement -



