- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా పలువురు నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా బండి సంజయ్కు సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. మొదట జులై 17న సిట్ నుంచి నోటీసులు అందుకున్న బండి.. జులై 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అధికారిక కార్యక్రమాల వల్ల విచారణ హాజరు కాలేకపోవడంతో మంగళవారం ఆగస్టు 8న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది.
- Advertisement -