భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఫూలే’. ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ రోజు మన ఆడబిడ్డలు చదువుకుని గొప్ప స్థాయికి వెళ్తున్నారంటే కారణం సావిత్రీబాయి పూలే ఎన్నో ఏళ్ల కిందట చేసిన కృషి కారణం.
సమాజంలోని ఎన్నో దురాచారాలను రూపు మాపేందుకు పూలే దంపతులు పోరాటం చేసి, సమాజ హితం కోసమే తమ జీవితాలను అంకితం చేశారు. మూఢ నమ్మకాలు, దురాచారాల నుంచి మహిలళను కాపాడేందుకు వారు చేసిన కృషి అద్భుతమైనది. వితంతు పునర్వివాహాలు జరిపించారు. ఇలాంటి గొప్పవారి జీవిత చరిత్ర మన వాళ్లకు సినిమా మాధ్యమం ద్వారా తెలియజెప్పాలనే ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. పూర్ణ చంద్ర, డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి పాటలు రాశారు. చేతన్ కత్తి డైలాగ్స్ అందించారు. తిరుపతి, జనని నిర్మాణ పర్యవేక్షణలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది. ఈ నెలాఖరుకు విడుదలకు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా మా సినిమాకు సహకారం అందించాలని కోరుతున్నాను’ అని అన్నారు.
సేవా స్ఫూర్తి కలిగించే ‘ఫూలే’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



