- Advertisement -
నవతెలంగాణ – కంటేశ్వర్
ఈ సుందర దృశ్యం నిజామాబాద్ అర్బన్ లోని నాందేవ్ వాడా లోగల 35 వ డివిసన్ లోనిది. ఈ 35వ డివిసన్లో గత 8 సంవత్సరాలుగా పైప్ లైన్ లీకేజీ అవుతున్నా.. నాయకులు అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొందని నిజాంబాద్ అర్బన్ జాగృతి బాధ్యులు కలిపే రాజు మంగళవారం తెలిపారు. పలుమార్లు 35 డివిసన్ వాసులు కలెక్టర్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో అరకొర నామమాత్రంగా పనులు చేస్తూ మమ అనిపించుకుంటున్నారు. ఈ సారయినా 35 డివిసన్ కు సంబంధించిన పైప్ లైన్ ను మళ్ళీ మళ్ళీ లీకేజీ కాకుండా పనులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
- Advertisement -



