- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రహ్మ కుమారిస్ నగరంలోని నాందేవాడ శాఖలో గురువారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. సంస్థ నిర్వాహకులు బి.కె.సునీత బెహన్ జీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి అనేక రకాల మొక్కల కుండీలను బహుమతిగా ఇచ్చారు. ఆన్తరంగిక, బయట వాతావరణాన్ని ఎలా శుద్దిగా ఉంచుకోవాలో తెలియజేసారు. పర్యవర నాన్నీ పరిరక్షించుట కోసం వాతవరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపింపచేసి సంఘటితంగా ధ్యానం చేసారు. వచ్చిన అందరికి ప్లాస్టిక్ కవర్ల వాడటం వల్ల ఎంత నష్టం కలుగుతుందో తెలియచేసి వారితో వీలున్నంత వరకు ప్లాస్టిక్ కవర్లు వాడము అని ప్రతిజ్ఞ చేయించారు.
- Advertisement -