Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంచైనాలో ‘ఎస్సీఓ’ శిఖరాగ్ర సమావేశం..ప్ర‌ధాని మోడీ హాజ‌రు

చైనాలో ‘ఎస్సీఓ’ శిఖరాగ్ర సమావేశం..ప్ర‌ధాని మోడీ హాజ‌రు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: చైనా పర్యటనలో మూడో రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు(సోమవారం) టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి తిరిగి వచ్చే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజధాని బీజింగ్‌లో భారీ సైనిక కవాతు జరగడానికి కొన్ని రోజుల ముందు ఆదివారం ఉత్తర ఓడరేవు నగరం టియాంజిన్‌లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. భారత ప్రధాని మోడీ పర్యటనపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పందిస్తూ… ప్రధానమంత్రి శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తారని, ఎస్సీఓ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో భారతదేశం యొక్క విధానాన్ని ఆయన వివరిస్తారని అన్నారు. మోదీ ఆదివారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌లను కూడా కలిశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad