– టీ కప్పులో తుపాన్లా బీఆర్ఎస్లో గొడవలు : ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం
– ప్రజల నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించిన మంత్రి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్లో నెలకొన్న గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివని ఆయన చెప్పారు. అనివార్య కారణాలతో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లోని ఇందిరాగాంధీభవన్లో మంత్రి పొన్నం తిరిగి కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తల నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. కొన్ని సమస్యలపై వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చూపించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి, భూసంబంధ సమస్యలు, ఉద్యోగ బదిలీలు…ఇలా అనేక సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం ముఖాముఖి కార్యక్రమం పున:ప్రారంభించామన్నారు. ప్రజాభవన్ లో ప్రజాసమస్యలకు సంబంధించిన విజ్ఞప్తులను తీసుకుంటూనే…గాంధీభవన్లో కార్యకర్తలు, నాయకుల సమస్యలను తెలుసుకుంటున్నామని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అందులో భాగంగా నాయకులు, కార్యకర్తలతో మంత్రులు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందరమ్మ ఇండ్లు పెద్ద ఎత్తున నిర్మింస్తున్నామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన ‘ముఖాముఖి’ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES