- జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ హెడ్ కానిస్టేబుల్స్ , అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ఏఎస్సైలు) బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, గురువారం తేది 12-06-2025 న నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బదిలీలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పై, పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో చేపట్టడం జరిగిందన్నారు. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్స్, మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏఎస్సైల బదిలీల్లో వారి విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు (స్పౌస్), ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందన్నారు. హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సైలు తమ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేలా, నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలనీ, ఇటువంటి సమగ్రమైన పని తీరుతోనే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది అని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.