Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఈద్గా మైదానంలో ప్రార్థనలు

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఈద్గా మైదానంలో ప్రార్థనలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు వారం పది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మండల కేంద్రంలోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు జావిద్ పటేల్ తెలిపారు. అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న ఎమ్మెల్యే తోటా ముస్లిం సోదరుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -