Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే ఆరోగ్యం పట్ల త్వరగా కోలుకోవాలని మసీదులో ప్రార్థనలు

ఎమ్మెల్యే ఆరోగ్యం పట్ల త్వరగా కోలుకోవాలని మసీదులో ప్రార్థనలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న విషయం తెలిసింది. ఎమ్మెల్యే ఆరోగ్యం పట్ల ముస్లిం సోదరులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జావిద్ పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని శుక్రవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మసీదులో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థనల ద్వారా కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుని ఆయన ఆరోగ్యంతో ప్రజలకు సేవలందించడానికి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -