- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి మోడీ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఆదివారం కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుండి మూడు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెళగావి, మాతా వైష్ణోదేవి కాత్రా-అమృత్సర్, నాగ్పూర్-పుణే వందే భారత్ రైళ్లు ఉన్నాయి. తరువాత, ఎలక్ట్రానిక్ నగరాన్ని బొమ్మనహళ్లితో అనుసంధానించే ఎల్లో లైన్ మెట్రో సేవను ప్రధానమంత్రి ప్రారంభించారు. బెంగళూరు-బెళగావి వందేభారత్ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం తరువాత రెండు కారిడార్లతో కూడిన నమ్మ మెట్రో మూడవ దశకు మోడీ పునాది రాయి వేస్తారు.

- Advertisement -