- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంగోలియా ప్రధాని ఓయున్ ఎర్డెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటులో విశ్వాస ఓటుపై మద్దతు కూడగట్టడంలో ఎర్డెన్ విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగగా ఆయనకు 44 మంది చట్టసభ సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు. విశ్వాస తీర్మానం వీగిపోవడానికి 64 ఓట్లు అవసరం కాగా ఎర్డెన్ మరో 20 ఓట్ల దూరంలో నిలిచిపోయారు. 30 రోజుల్లోగా కొత్త ప్రధానిని పార్లమెంట్ ఎన్నుకోంది.
- Advertisement -